దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు కానుకలివ్వడం పరిపాటి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సోదరుల రక్షణకోసం వారికి సోదరీమణులు హెల్మెట్లు తిరుగు కానుక ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.