శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఉగాది మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దాంతో ఆంధ్ర-తెలంగాణ రహదారులు నిండిపోయాయి. ఆదివారం సెలవు కావడతో భక్తులు రాకపోకలు అనూహ్యంగా పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టోల్ గేట్ వద్ద వాహనాలకు టికెట్ ఇవ్వటానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.