తిరుమల శ్రీవారిని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు.
ఈ ఉదయం కుటుంబసభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకుని వెంకన్న ఆశీస్సులు పొందారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ చాలా చోట్ల మహిళల పై వేధింపులు జరుగుతుండడం శోచనీయమని స్వామి దర్శనానంతరం అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక యువతీ పై జరిగిన అత్యాచారంలో సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కావడం దారుణమన్నారు రాజకుమారి.