శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు స్వామి వారి
పాదాలను తాకాయి. ఈ అద్భుతం ఈరోజు ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో జరిగిందని పూజారులు తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 9,10, తేదీల్లో అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామి వారి మూలవిరాటును స్పృశిస్తాయి. ఈ అద్భుతాన్ని తిలకించిన సూర్యనారాయణస్వామి భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు. సూర్య కిరణాలు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి. ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించారు.