టిటిడి అనుబంధ ఆలయం అయిన తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళా స్వామి కల్పవృక్షా వాహనంపై ఊరేగారు.
సకళ గుణాభి రాముడు అయిన స్వామి సఖల జీవ రాశులకు అభయాన్ని ప్రసాదిస్తూ మాడవీదుల్లో విహరించారు. అలా కదిలి వస్తున్న స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు రామ మంత్రోశ్చారాల నడుమ దర్శించుకున్నారు. అడుగడుగునా కళాకారుల నృత్య, కోలాట ప్రదర్శనలు భక్తలను ఆకట్టుకున్నాయి.