హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్
లావణ్యతో పాటు వరంగల్ జేడీ కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగి పాషాను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఈ స్కేలములో తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి రూ.28 కోట్ల మందుల కొనుగోళ్ల అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ ముగ్గురు పెద్దమొత్తంలో ఈఎస్ఐ మందులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి అరెస్టులతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 16కు చేరింది.